Saturday 29 June 2013

APPSC News

ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి రెండేళ్లు సడలింపు
హైదరాబాద్, జూన్ 29: నిరుద్యోగులకు కాస్తంత ఊరట. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని ఐదేళ్లు పెంచాలని వారు కోరుతుండగా.. రెండేళ్లే సడలిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.518) జారీ చేసింది. ప్రస్తుత వయోపరిమితి 34 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్,1996 లోని 12వ రూల్ కింద ఉన్న కేటగిరీలకూ ఈ సడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సడలింపును అడ్‌హాక్ రూల్‌గా పరిగణించాలని స్పష్టం చేసిందిఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఇతర రిక్రూటింగ్ ఏజన్సీల ద్వారా నేరుగా చేపట్టే నియామకాల(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్)కు గరిష్ఠ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి విడుదలయ్యే నోటిఫికేషన్లకే ఇది వర్తిస్తుంది. ఈ సడలింపు నుంచి పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖలను మినహాయించారు. కాగా, త్వరలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేప«థ్యంలో నిరుద్యోగ యువత, పలు సంఘాలు, ఇతర ప్రముఖుల నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లలో వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులను కలిసి విన్నవించారు. నిర్దిష్ట కాలావధిలో ఖాళీ పోస్టుల భర్తీ జరగనందున గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్ల వరకు(34 నుంచి 39కి) సడలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కానీ దీనిపై భిన్నకోణాల్లో ఆలోచించిన ప్రభుత్వం సడలింపును రెండేళ్లకే పరిమితం చేసి వయోపరిమితిని 39 ఏళ్లకు పెంచితే.. బాగా పనిచేసే యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం








Source:Andhra Jyothi

No comments:

Post a Comment